పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే

పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ: ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి రూ.16,12,908 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న ఆరుగురు బాధితులకు ఈ ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు.