ఈ నెల 3న పుష్పగిరి ఆలయ వేళల్లో మార్పులు
KDP: వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 7.30 వరకు స్వామివారి దర్శనాలు ఉండవని ఈవో శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 7.30 తర్వాత ఆలయ శుద్ధి, విశేష అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.