విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.46 లక్షలు

విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.46 లక్షలు

కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో గురువారం స్వామి వారికి భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,46,237 ఆదాయం లభించిందని ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 108 మంది స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. 10 మంది లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 1500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.