డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డయాలసిస్ ఇంఛార్జ్ సాయి రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ.. మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారు తమ జీవనశైలిని మార్చుకోవాలని, పరిమితంగా నీరు త్రాగాలని, ఆహార శైలిలో మార్పులు చేసుకొని, నిపుణులు చెప్పిన విధంగా ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.