VIDEO: సభలో లేని సభ్యుల పేర్లు ఉచ్చరించవద్దు
HYD: మాజీ సీఎం కేసీఆర్కు డ్రగ్స్ టెస్ట్ చేయాలి అంటూ TOCC చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో లేని వ్యక్తుల పేర్లు ఉచ్చరించవద్దని, సభను హుందాగా ప్రశాంత వాతావరణంలో జరుపుకుందాం అని సూచించారు. సభలో లేని వ్యక్తుల పేర్లు తీసుకున్నందుకు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు.