ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
NRML: బైక్ కొనియ్యనందుకు యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కడెం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సారంగాపూర్కు చెందిన పోతరాజు రాకేష్ (26) తన తండ్రి రమేష్ను తరచూ బైక్ కొనియ్యమని అడిగాడు. బైక్ కొనియ్యకపోవడంతో ఆదివారం సాయంత్రం పొలానికి వెళ్తున్నానని చెప్పి సమీపంలోని గోదావరి నదీ తీరాన చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.