అక్టోబర్లో ఆంధ్ర తీరాన్ని దాటిన తుపాన్లు ఇవే..!
VSP: ఈశాన్య రుతుపవనాల సీజన్ మొదలయ్యాక గత 20 ఏళ్లలో అక్టోబర్ నెలలో రాష్ట్రంలో ఏర్పడిన తుపానులను పరిశీలిస్తే.. 2006 అక్టోబర్ 30న 'ఒగ్ని' తుపాను ఒంగోలు–మచిలీపట్నంల మధ్య, 2014 అక్టోబర్ 12న సూపర్ సైక్లోన్ 'హుద్హుద్' విశాఖలో, 2018 అక్టోబర్ 11న 'తిత్లీ' అతి తీవ్ర తుపాను శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో తీరాన్ని దాటింది.