యువకునికి కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్
KNR: హుజూరాబాద్కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ దండుగుడుం మహేశ్కు కంప్యూటర్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ లభించింది. అడ్వాన్స్డ్ నెట్వర్క్ భద్రతపై చేసిన పరిశోధనలకు గాను SR యూనివర్సిటీ ఛాన్స్లర్ దీపక్ గార్గ్ పీహెచ్డీ పట్టా ప్రదానం చేశారు. నెట్వర్క్ దాడులను గుర్తించి నియంత్రించే విధానాలపై డాక్టర్ తాళ్లపెల్లి సంపత్ కుమార్ మార్గదర్శకత్వంలో పరిశోధన పూర్తి చేశారు.