ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రులు

JN: జనగామ ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డిని నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేను కలిశారు. రానున్న రోజుల్లో జరగనున్న రాజకీయ పరిణామాలపై వీరు చర్చించారు.