ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే

SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు జి.సిగడాం మండలం పర్యటన ముగించుకుని అటుగా వెళ్తున్న చీపురుపల్లి-శ్రీకాకుళం ఆర్టీసీ బస్సును వెంకటాపురం జంక్షన్ వద్ద బస్సు ఎక్కారు. ఈ మేరకు బస్సులో ఉన్న విద్యార్ధులు, వృద్ధుల్ని, మహిళలు, ప్రతి ఒక్కరితో చనువుగా మాట్లాడారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రయాణికుల నుండి సానుకూల స్పందన రావడంతో ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు.