'ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలి'

ADB: రూరల్ మండలంలోని యాపల్ గూడకు భజన మండలికి స్థానిక కొప్పుల కిరణ్ హార్మోనియం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఆధ్యాత్మిక భావన పెరిగితేనే ప్రశాంతత అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడవాలన్నారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు తుడి రాకేష్, సిల్వర్ అశోక్, ఉష్కం గణేష్, దత్తు తదితరులు పాల్గొన్నారు.