నాదెండ్ల ఘర్షణ.. 17 మందికి రిమాండ్
PLD: నాదెండ్ల మండలం గణపవరంలో మార్చి 25న జరిగిన ఘర్షణకు సంబంధించి 37 మందిపై నాదెండ్ల పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా శనివారం 17 మందిని అరెస్టు చేసి చిలకలూరిపేట కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో నిందితులను నరసరావుపేట సబ్ జైలుకు తరలించారు.