గూగుల్ 'ఏఐ ప్లస్' లాంచ్.. నెలకు ఎంతంటే?
గూగుల్ సంస్థ 'ఏఐ ప్లస్'ను భారత్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని నెలవారీ చందా రూ.399గా వెల్లడించింది. కొత్తగా వచ్చిన వినియోగదారులకు రూ.199 చొప్పున మొదటి ఆరు నెలలు అందించనుంది. ఈ ప్లాన్లో పలు ఏఐ పవర్డ్ ఉత్పత్తులు, నోట్బుక్ LM, జెమినీ యాప్ వంటివి అందుబాటులో ఉండనున్నాయి.