'ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలి'
SRCL: ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ మండల కన్వీనర్ ఇప్పిరెడ్డి గణేష్ రెడ్డి కోరారు. కోనరావుపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రూ. 8500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.