ద్విచక్ర వాహనాన్ని దహనం చేసిన దుండగులు

ద్విచక్ర వాహనాన్ని దహనం చేసిన దుండగులు

KDP: కమలాపురం రైల్వే స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దుండగులు ఒక ద్విచక్ర వాహనానికి నిప్పంటించి దహనం చేశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా కాలిపోయింది. నిప్పంటించిన వ్యక్తులు, వాహన యజమాని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.