పైడితల్లి అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే గణబాబు
VSP: గోపాలపట్నం ప్రశాంతనగర్లోని పైడితల్లమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి షష్టి సందర్భంగా గురువారం స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, ప్రభుత్వ విప్ గణబాబు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.