టీటీడీ ప్రాణదానం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

TPT: ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్కు చెందిన ఎక్స్ప్రెస్ ఇన్ఫ్రా ఎండీ శ్రీమతి కవిత సింఘానియా శుక్రవారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం అందించారు. ఈ మేరకు దాత ప్రతినిధులు జాన్ మని, బొమ్మల మురళీలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.