వైన్ షాప్ వచ్చింది.. ఉద్యోగం పోయింది!
MBNR: జిల్లా రాంనగర్ బాలికల పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న పుష్ప భర్త మద్యం టెండర్ వేయగా వారికి ధర్మపూర్ వైన్షాప్ లక్కీ డిప్లో దక్కింది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు మద్యం టెండర్లకు అర్హులు కాదన్న నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు రావడంతో అధికారులు విచారణ జరిపి, సంబంధిత ఆధారాలు పరిశీలించిన జిల్లా విద్యాధికారి ప్రవీణ్కుమార్ PET పుష్పను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.