కుప్పంలో ఐదేళ్ల తర్వాత ఒకరి అరెస్ట్
CTR: కుప్పం వైసీపీ నేత విద్యాసాగర్పై 2020లో హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఐదేళ్ల తర్వాత నిందితుడు రమేశ్ను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ శంకరయ్య తెలిపారు. 2020లో వైసీపీలో అంతర్గత విభేదాలు వచ్చాయి. విద్యా సాగర్ను హత్య చేయాలని రత్న, రమేశ్, కృష్ణమూర్తి కలిసి కుట్ర చేశారు. పీలేరుకు చెందిన గణేశ్కు సుఫారీ ఇచ్చారు.