విద్యపై 'సవతి తల్లి ప్రేమ' తగదు: PDSU
KMM: సమాజ మార్పునకు కీలకమైన విద్యపై రాష్ట్ర ప్రభుత్వం 'సవతి తల్లి ప్రేమ' కనబరుస్తోందని PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ ఆరోపించారు. ఇవాళ సత్తుపల్లిలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.