టెన్త్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపుకలెక్టర్

టెన్త్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపుకలెక్టర్

KMM: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. మంగళవారం డీఈఓ చైతన్య జైనీతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.