"పీహెచ్డీ పట్టా అందుకున్న సీతాఫల్మండి కార్పొరేటర్"

HYD: ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో 84వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. సభలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వీ.నారాయణన్ చేతుల మీదుగా కార్పొరేటర్ సామల హేమ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్మెంట్లో పీహెచ్డీ పట్టాపొందారు. ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్ను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సంతోషంగా ఉందని తెలిపారు.