పాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు చెక్కులు పంపిణీ

కృష్ణా: తిరువూరు క్లస్టర్ పరిధిలోని లక్ష్మీపురంలో గురువారం బోనస్ చెక్కుల పంపిణీ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడత 10% చెక్కులను పాల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు ఛైర్మన్ చలసాని ఆంజనేయులు అందజేశారు. జిల్లా పాలకవర్గ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు, క్లస్టర్ మేనేజర్, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.