VIDEO: విద్యార్థి మృతదేహంతో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన
గుంటూరు కొత్తపేటలోని శ్రీ కాసు సాయమా హైస్కూల్లో జరిగిన ఘర్షణలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన భరత్ కుమార్ మృతదేహంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కలెక్టర్ కాన్వాయ్ను అడ్డుకున్న విద్యార్థి తల్లి, తన కుమారుడి చావుకు కారణమైన వారిని శిక్షించాలని కలెక్టర్ కాళ్లపై పడుతూ వేడుకుంది.