నేడు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20
భారత్-సౌతాఫ్రికా మధ్య ఇవాళ రెండో టీ20 జరగనుంది. చండీగఢ్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టీ20లో సఫారీలను చిత్తు చేసిన టీమిండియా ఈ మ్యాచ్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు తొలి మ్యాచ్లో ఘోర ఓటమికి బదులుతీర్చుకోవాలని సౌతాఫ్రికా చూస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది.