రాష్ట్ర స్థాయి యాదవ మహాసభలో ఎన్నికలు
TPT: విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి యాదవ మహాసభలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి కొత్త కమిటీని ఎన్నుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షుడిగా కునాటి రమణయ్య యాదవ్ ఎన్నిక కాగా, నియోజకవర్గ కార్యదర్శిగా జనార్దన్ యాదవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు వారిని అభినందిస్తూ యాదవ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.