మానవత్వం చాటిన భారత ఆర్మీ

మానవత్వం చాటిన భారత ఆర్మీ

భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దులో దాయది దేశం కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలామంది సామాన్య పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ మానవత్వం చాటుకుంది. పాక్ కాల్పులకు ప్రభావితమైన జమ్మూ, కశ్మీర్, ఉరి సెక్టార్లలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి వైద్య సాయం అందిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో SMలో వైరల్ కాగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.