ఒమన్లో డ్రోన్ దాడి.. ఐదుగురు భారతీయులు మృతి
ఒమన్ సోహార్ నగరంలో జరిగిన డ్రోన్ దాడిలో ఐదుగురు భారతీయులు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎవరికీ ప్రాణప్రాయం లేదని తెలుస్తోంది. బాధితులతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వారికి అవసరమైన సాయం అందిస్తున్నట్లు భారత విదేశాంగ వెల్లడించింది. అంతకుముందు మర్చంట్ నౌకల్లో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారు.