బస్సు, సెఫ్టిక్ ట్యాంక్ ఢీ
GNTR: తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రి సమీపంలో శుక్రవారం ఆర్టీసీ బస్సు,సెప్టిక్ ట్యాంక్ లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతింది. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు.