విష్ణుపురి కాంప్లెక్స్లో ఎంఎంసీ కమిషనర్
HYD: మౌలాలి డివిజన్ పరిధిలోని విష్ణుపురి కాంప్లెక్స్లో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది పనితీరును అధికారులు ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు.