అక్రమ ఇసుక లారీలు సీజ్.. నలుగురిపై కేసు
SRPT: అనుమతులు లేకుండా భద్రాచలం నుంచి హైదరాబాద్కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. నూతన్కల్లో ఎర్రపహాడ్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీల్లో ఈ అక్రమం వెలుగుచూసింది. లారీ యజమాని బచ్చనబోయిన యాదయ్యతో పాటు బొబ్బల లింగస్వామి, మర్రి మహేశ్, వెంకట్రావులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.