లింక్ ఓపెన్ చేయగానే రూ.9.20 లక్షలు మాయం
KMM: మధిర పట్టణంలోని ఓ వ్యాపారి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. శుక్రవారం రాత్రి తన మొబైల్ కు వచ్చిన లింక్ను ఓపెన్ చేయగానే ఆయన ఖాతా నుంచి రూ.9.20 లక్షలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. ఇది సైబర్ మోసంగా గుర్తించాడు. బాధితుడు శనివారం ఖమ్మం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.