పేరూరు డ్యాంకు నీరు విడుదల చేయాలి: తోపుదుర్తి
ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఆరు మండలాల నాయకులతో కలిసి పేరూరు డ్యాంకు వెంటనే నీరు విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి చొరవతో డ్యాంకు నీరు అందించి రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు.