పీఎండీఎస్ కిట్లపై అవగాహన
PLD: యడ్లపాడు మండలం చీఘిస్ ఖాన్పేట్లో ప్రకృతి వ్యవసాయంపై మంగళవారం అవగాహన సదస్సు జరిగింది. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ అమల కుమారి రైతులకు పీఎండీఎస్ కిట్ల వాడకంపై వివరించారు. తొలకరి కంటే ముందే 30 రకాల విత్తనాల కిట్ను చల్లడం వల్ల నేలలో తేమ నిలిచి పంటలు ఎండను తట్టుకుంటాయన్నారు. దీనివల్ల సేంద్రియ కర్బనం, దిగుబడి పెరుగుతుందన్నారు.