ఉపాధి హామీ పనులను ప్రారంభించిన సర్పంచ్
KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో గురువారం సర్పంచ్ మ్యాకల స్వప్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాలకుంట్ల చేపల పెంపకం కోసం ఫిష్ పార్ట్ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బైరి రాజు, సీనియర్ మేటి రేగుల మధుకర్, పెసరు తిరుపతి, మొలుగూరి తిరుపతి, తదితరులు ఉన్నారు.