ఉగాది పండుగ.. కిటకిటలాడుతున్న పూలదుకాణాలు

ఉగాది పండుగ.. కిటకిటలాడుతున్న పూలదుకాణాలు

KDP: నగరంలోని పాత బస్టాండు వద్ద పూల దుకాణాలు కిక్కిరిసిపోయాయి. ఉగాది పండుగ రావడంతో పూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున దుకాణాలకు వచ్చారు. నిన్నటి వరకు బంతి పూలు కిలో పది రూపాయలు ఉండగా, ప్రస్తుతం పండుగ వల్ల కిలో రూ.60 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. అలాగే కనకాంబరాలు కిలో రూ.700 వరకు ధర పలుకుతుంది.