ఆపరేషన్ కగార్‌ నిలిపేయాలి: అఖిలపక్ష నేతలు

ఆపరేషన్ కగార్‌ నిలిపేయాలి: అఖిలపక్ష నేతలు

TG: హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అఖిలపక్ష నేతలు నిరసన తెలిపారు. ఇందులో కూనంనేని సాంబశివరావు, అజీజ్‌పాషా, కోదండరామ్‌ పాల్గొన్నారు. మావోయిస్టుల ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఆపరేషన్ కగార్‌ నిలిపేయాలని, ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.