ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద

MNCL: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 25 వేల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 11938 క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లకు చేరగా.. నీటి నిల్వ 20.175 టీఎంసీలుగా ఉంది. 10 గేట్లు ఎత్తి 80511 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదిలారు.