మందపల్లిలో గణపతికి పంచలోహ కవచం బహుకరణ

మందపల్లిలో గణపతికి పంచలోహ కవచం బహుకరణ

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లిలో శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న ఉమా నాగేశ్వర స్వామి ఆలయంలో గణపతికి ఆదివారం విజయవాడ కు చెందిన పల్లపు రాజు వెంకట సత్యనారాయణ దంపతులు పంచలోహ కవచాన్ని అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితుడు వెంకన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.