స్వామివారి సేవలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శనివారం సాయంత్రం కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ధనపాల్ వారికి ఘన స్వాగతం పలికారు. శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని బహుకరించారు.