ఆహార నిల్వలపై వ్యాపారులకు హెచ్చరిక

వ్యాపారులు అత్యవసర ఆహార పదార్థాల నిల్వలు పెంచుకుంటున్నట్లు సమాచారం రావడంతో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. నిల్వలు పెంచుకుంటున్న ట్రేడర్లు, హోల్సేల్ వ్యాపారులు, రిటైలర్లను హెచ్చరించారు. ప్రభుత్వం వద్ద చాలినన్ని నిల్వలు ఉన్నాయన్నారు. ఎవరైనా పెద్ద ఎత్తున సేకరించడం కానీ, నిల్వ చేయడం కానీ చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.