కోదండ రామయ్య హుండీ ఆదాయం రూ. 6.10 లక్షలు
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయం హుండీలోని ఆదాయాన్ని TTD అధికారులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు లెక్కించారు. గత నెల 14వ తేదీ నుంచి మంగళవారం వరకు రామయ్య సన్నిధిలో రంగ, ముఖ మండపం, భక్త సంజీవరాయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీల్లో భక్తులు కానుకలను సమర్పించారు. ఈ హుండీలను లెక్కించగా రూ. 6.10 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారి నవీన్ కుమార్ తెలిపారు.