విఘ్నేశ్వర అన్న దాన ట్రస్ట్ కు రూ.లక్ష విరాళం
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం హైదరాబాద్కు చెందిన మంతెన రవి వర్మ, ఉషా దేవి దంపతులు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా రూ.1,00,008 ఆలయ అధికారులకు అందజేశారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రములతో సత్కరించి, స్వామి వారి చిత్రపటం అందజేశారు.