లింగాలలో రేపు సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం

లింగాలలో రేపు సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం

KDP: లింగాల మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులపై రేపు సమావేశం జరగనుంది. 20వ విడత సామాజిక తనిఖీ, బహిరంగ సభ, మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో బుధవారం జరుగుతుందని ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమావేశానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామీణ శ్రామికులు తప్పక హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.