మోదీ రోడ్‌షోలో పాల్గొన్న సోఫియా కుటుంబసభ్యులు

మోదీ రోడ్‌షోలో పాల్గొన్న సోఫియా కుటుంబసభ్యులు

గుజరాత్ వడోదరాలో ప్రధాని మోదీ రోడ్‌షోలో కర్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ర్యాలీలో మోదీపై పూలు చల్లి ఘన స్వాగతం పలికారు. ఆపరేషన్ సింధూర్ వివరాలను మీడియాకు వెల్లడించడంతో వార్తల్లో సోఫియా నిలిచారు. మహిళా సాధికారత కోసం మోదీ చాలా కృషి చేశారని సోఫియా ట్విన్ సిస్టర్ షైనా కొనియాడారు. ఖురేషి తనకు మాత్రమే సోదరి కాదని దేశంలోని ప్రతి మహిళకు సోదరీ అని అన్నారు.