పిడుగు పడి పాడి గేదె మృతి
PLD: పెదకూరపాడు లగడపాడు గ్రామానికి చెందిన పళ్లెం ఏసుబాబు గేదె గురువారం కురిసిన వర్షం, పిడుగుపాటుకు గురై మృతి చెందిందని తెలిపాడు. అకాల వర్షం రావడంతో చెట్టుకు గేదెను కట్టాడని, ఒక్కసారిగా పిడుగుపడటంతో గేదె చనిపోయిందని పాడి రైతు కంటతడి పెట్టుకున్నాడు. సంఘటన స్థలానికి వీఆర్వో సిల్వరాజ్ పరిశీలించారు.