ముంబయి వెళదామంటే...రైళ్లే లేవోయి
NZB: దేశ ఆర్థిక రాజధాని ముంబయికి ఉపాధి వెతుక్కుంటూ ఉమ్మడి జిల్లా నుంచి ఎంతోమంది వలస వెళ్లారు. గల్ఫ్ తర్వాత అత్యధిక మంది ఆశ్రయించేది పొరుగు రాష్ట్రంలోని మహానగరాన్నే కావడం విశేషం. వీరితో పాటు ఉన్నత విద్య కోసం, పర్యాటక యాత్రలకు ఏటా వేలాది మంది తరలివెళ్తున్నా నిజామాబాద్ రైల్వే జంక్షన్ నుంచి ఇప్పటికీ కనీస రైలు సదుపాయాల్లేకపోవడం గమనార్హం.