నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్రకాశం: ఒంగోలు నగర పరిధిలోని పలు కాలనీల్లో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ డీజీ పాండురంగారావు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా పీర్లమాన్యం, అరుణోదయ కాలనీ, టీచర్స్ కాలనీ, సమతానగర్, శ్రీరామ్ కాలనీ, శ్రీకృష్ణనగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, భాగ్యనగర్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఉండదన్నారు.