VIDEO: 'వాహనాలపై ప్రత్యేక డ్రైవ్.. 25 బైక్లు స్వాధీనం'
MNCL: రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజలు నిబంధనలు పాటించాలని మందమర్రి CI శశిధర్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రహదారిపై రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈ డ్రైవ్లో, నిబంధనలను ఉల్లంఘించిన 25 బైక్ లను స్వాధీనం చేసుకొని, బైక్లపై తదుపరి చట్టపరమైన చర్యల కోసం మంచిర్యాల RTO ఆఫీస్కి నివేదించామని తెలిపారు.