క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
AP: కృష్ణా జిల్లా గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు అయ్యింది. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.05 లక్షలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెట్టింగ్కు పాల్పడిన వారినపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల ప్రత్యేక నిఘాతో బెట్టింగ్ ముఠా దందా వెలుగులోకి వచ్చింది.